మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. సక్సెస్ కోసం అంతగా ఎదురు చూడకుండానే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కెరీర్ ప్రారంభంలో వరుసగా మంచి కమర్షియల్ సక్సస్ లను అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ ఎంచుకున్న కొన్ని కథ లు సెట్ అవకపోవడంతో వరసగా ప్లాప్లతో సతమతం అయ్యాడు.
ఇలాంటి సమయంలోనే చిత్రలహరి, ప్రతిరోజు పండగే లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు తేజు. ఇదే జోష్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని కంప్లీట్ చేసాడు. ఈ సమయంలో కరోనా వచ్చి అందరిని ఇంటికే పరిమితం చేసింది. ఇకపోతే తర్వాతి ప్రాజెక్ట్గా ‘ప్రస్థానం’ తో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను క్రేజ్ సంపాదించుకున్న దేవకట్టా దర్శకత్వంలో తేజు ఓ సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్నారు.
కాగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్న తేజ్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని.. ఇదివరకు తాను ఏ సినిమాలో చేయని విధంగా తన పాత్రను మలిచారన్న వార్తలు వస్తున్నాయి. ఇలా పక్క స్క్రిప్ట్తో నటుడిగా సాయిధరమ్ తేజ్ ను మరో మెట్టు పైకెక్కించే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిధి పాత్రలో నటించబోతున్నాడని ఒక వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదేగాక ఇది వరకు సాయిధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాకు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయారు. బోకే పంపి మరీ కంగ్రాట్స్ చెప్పడం అటు మెగా ఫ్యాన్స్ ని ఇటు ప్రేక్షకులను ఆనందం లో ముంచేసింది. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేం లో కనిపిస్తే చూడాలని ఎంతగానో ఆశపడుతున్నారు. అందుకే ఈ మెగా మేనల్లుడి సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం ఒక విశేషం అని అభిమానులు అనుకుంటూన్నారట. ఇందులో ఎంత వరకు నిజముందో అధికారంగా వెల్లడైతే గాని క్లారిటీ రాదు.
ఇక పవన్ కళ్యాణ్ ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజ్ సినిమాలో ఫస్ట్ టైం కనిపించనున్నాడు.. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్న పవన్.. మేనల్లుడి సినిమాలో నటించాలనే నిర్ణయం ఒక రకంగా షాక్ ఇచ్చేదే అయినా, పవన్ అభిమానులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకుంటున్నారు.