ఇప్పుడు యావత్ ఇండియాలోనే హీరో ప్రభాస్ అంటేనే ఓ సంచలనం. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ అమాంతం ఆకాశాన్నంటింది. అయితే దాని తరువాత అతను వరుస పరాజయాలు చూస్తున్నాడు. నార్మల్ స్దాయి హీరో నుండి.. పాన్ ఇండియా సినిమాలు చేసే స్దాయికి ఎదిగిన క్రమంలో ప్రభాస్ పడిన కష్టం అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఆయనతో పనిచేసే వాళ్లు ప్రభాస్ మంచితనం గురించి ఎప్పుడు చెప్పుతూనే ఉంటారు. ఫుడ్ తన తోటివాళ్లతో షేర్ చేసుకుంటాడని.. నవ్వుతూ మాట్లాడిస్తాడు అని.. సరదాగా అందరితో కలిసిపోతాడు అని.. ఇలా అతగాడి గురించి పాజిటీవ్ గా చెబుతూ వుంటారు.
ఇక అతని గురించి ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా రెబల్ ఫాన్స్ తట్టుకోలేరు. ఆ పరిస్థితి కూడా ఎప్పుడు రాలేదు. అయితే తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ విషయం గ్రహించిన రెబల్స్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అయితే ఆ మాటలు అన్నది మాత్రం ఓ జ్యోతిష్యుడు. అవును.. రెబల్ అభిమానులకు బిగ్ షాకింగ్ మ్యాటర్ ను బయటపెట్టి నిరాశే మిగిల్చారు ప్రముఖ సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి. వేణు స్వామి అని డైరెక్ట్ గా అనేకంటే వీణావాణి భర్త అంటేనే నేటి యువతకు అతగాడు ఎవ్వరో పూర్తిగా అర్ధం అవుతుంది.
అతగాడు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..ప్రభాస్ ఇప్పుడున్న పరిస్థితులలో పెళ్ళి చేసుకోవడమే ఉత్తమం అని, ఆయన జాతకంలో దోషం కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు అంత ఆశాజనకంగా ఉండవని అన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఎంత హైట్ కి వెళ్లాలో అంతవరకు చేరిపోయారని.. వెళ్ళడానికి ఇంకా ఏమి మిగిలి లేదని, కిందకు జారే అవకాశమే ఉందని, కాబట్టి ఇలాంటి పరిస్థితులలో పెళ్లి చేసుకుంటే.. జీవిత భాగస్వామి ద్వారా అయినా అతగాడి జాతకం మారవచ్చని ఓ ఉచిత సలహాలు ఇచ్చి పడేసారు. ఈ మాటలు విన్న రెబల్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అవుతుంది.