డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియోషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంట గా నటిస్తుంది. ఈ సినిమాని నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ గాని, సినిమా టైటిల్ గాని రిలీజ్ చేయక పోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా నుండి రెండు రోజుల క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన చిత్ర బృందం ఎట్టకేలకి తాజాగా రాధేశ్యామ్ అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.పోస్టర్ రిలీజైన కొద్ది నిముషాలలోనే వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్ అయితే నానా హంగామా చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా నిలిచింది. తిరిగి త్వరలో చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తుంది.