Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ప్రభాస్ ఒకవైపు ప్రశాంత్ నీల్ సలార్ , మరోవైపు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాలను చేస్తున్నారు.. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో పలుమార్లు చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్, షారుక్ ఖాన్ తో పటాన్ సినిమా తో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ కూడా ప్రభాస్ తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో ప్రముఖ మల్టీ స్టార్స్ నటించి అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రభాస్ ఇప్పటికే భారత బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రభాస్ తో కలిసి మల్టి స్టార్స్ నటించే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.