ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ చేయబోతున్న బాలీవుడ్ సినిమా “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని మన దేశపు పురాణాలకు చెందిన రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించనున్నారు.
అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ఓం రౌత్ సినిమా మీద బజ్ క్రియోట్ చేసేందుకు ఎప్పటికప్పుడు పక్కా క్లారిటీతో “ఆదిపురుష్” కి సంబంధించిన అప్డేట్లు ఇస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఇచ్చిన రెండు పెద్ద అప్డేట్స్ ఒకటి రామునిగా ప్రభాస్, రావణునిగా సైఫ్ కనిపించనున్నారని ప్రత్యేకమైన పోస్టర్స్ ను డిజైన్ చేసి మరీ సినిమా మేయిన్ థీం ని తెలిపారు. అదే విధంగా రామాయణంలోని ప్రధాన అంశం రామ, రావణుల మధ్య తప్పకుండా ఉండే యుద్ధం.
అందుకే మొదట ఈ రెండు పాత్రలనే పరిచయం చేస్తూ ఈ రెండు వైవిధ్యమైన పోస్టర్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ రెండు పోస్టర్స్ లో డీప్ గా ఆలోచిస్తే క్లూస్ క్లియర్ గా తెలిసేలా ఈ పోస్టర్స్ తయారు చేశారు. ప్రభాస్ ను పరిచయం చేసిన పోస్టర్ కలర్ ఉదయించే ఎర్రటి సూర్యకాంతి లా డిజైన్ చేసినట్టు అర్థమవుతుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ను రావణునిగా పరిచయం చేసిన పోస్టర్ మొత్తం నీలి రంగు లో డిజైన్ చేశారు.
అంటే ఒకటి పాత్రను పరిచయం చేస్తూనే మరొకరితో యుద్దం ఉంటుందన్న విషయాన్ని ఈ పోస్టర్స్ తో చూపిస్తున్నారు. శ్రీరాముణ్ణి “నీలి మేఘ శ్యాముడు” అని కూడా అంటారు. కానీ ఈ కలర్ రావణ పాత్రను పరిచయం చేస్తూ చూపించారు. మరి దీన్ని బట్టి దర్శకుడు ఎలా ప్లాన్ చేస్తున్నారో అన్నది ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇక ఈ సినిమాలో సీత పాత్ర లో నటించే హీరోయిన్ కోసం అనేషణ సాగుతోంది.