ప్రభాస్ టాలీవుడ్లో విపరీతమైన క్రేజీ ఉన్న హీరో. ఆకాశమే హద్దుగా ప్రభాస్ పాపులారిటీని సాధించాడు. ఏక్షణాన ‘బాహుబలి’ చిత్రం చేశారో అప్పటి నుండి ప్రభాస్ క్రేజ్ ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు దర్శకులు. ఇదిలా ఉండగా ప్రభాస్ సినిమాలంటే చూసేది కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. మొత్తం భారత్లోని అన్ని సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఈయన చిత్రాలంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారట.
అంతే కాదు దర్శకులైతే ఈ రెబల్ స్టార్ కోసమే ప్రత్యేకంగా కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. అలాంటి ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ ఈ భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. ఇక రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనుండగా సీతగా ఎవరు నటిస్తారనేది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆసక్తికరంగా మారింది.
ఈ నేపధ్యంలో ఇప్పటికే,దీపిక పదుకుణె, పూజా హెగ్డే.. ఇలా పలువురు పేర్లు ప్రచారం లో నిలిచాయి. కాగా అందరికంటే ఎక్కువగా బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న పేరు కృతి సనన్. కాగా ఈ భామ తెలుగులో మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ సినిమాలో కూడా నటించింది. కాని టాలీవుడ్లో నిలదొక్కుకోలేక బాలీవుడ్ వెళ్లింది. అక్కడ వరుస అవకాశాలతో పాటు సక్సెస్ కూడా అందుకుంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుందని తెలుస్తోంది. ఇకపోతే సీత గా కృతి సనన్ ఎప్పుడో ఫైనలైజ్ అయ్యిందని ఆ లుక్ను జనవరిలో రివీల్ చేయాలని భావించిన చిత్ర బృందం అప్పటివరకు ఈ విషయం బయటకు రాకుండా సీక్రెట్ మేయిన్టైన్ చేస్తున్నారని టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!