Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ – ప్రభాస్ కాంబోలో వచ్చిన రాధేశ్యామ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సాహో సినిమా మాదిరిగానే ఇంకా చెప్పాలంటే
అంతకంటే ఎక్కువ నష్ఠాలనే నిర్మాతలకు మిగిల్చింది.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే భారీ యాక్షన్ సినిమాను చేస్తున్న ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్తో ప్రాజెక్ట్ కే చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటుగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న పాన్ వరల్డ్ సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టా్ర్ సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో నటిస్తున్నాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు.
Prabhas: రామాయణం ఆధారంగా ఆదిపురుష్..
అయితే, ప్రస్తుతం షూటింగ్ పూర్తైన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నారు. అధిక భాగం చిత్రీకరణ గ్రీన్ మ్యాట్లో చేయడం వల్ల ఈ మూవీకి సంబంధించిన వీఎఫెక్స్ వర్క్ కోసమే చాలా నెలలు సమయం పడుతోంది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ చేస్తుండగా తాజా సమాచారం మేరకు 3డి ఫార్మాట్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భారతీయ పురాణాలలో అత్యంత ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు ఓంరౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా
రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2023, జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.