Prabhas : పాన్ ఇండియన్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాలలో ఆదిపురుష్ ఒకటి. 3డి ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా కావడం విశేషం. ఈ పాటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. హైదరాబాద్లో ప్లాన్ చేసిన షెడ్యూల్ కుదరకపోవడంతో మళ్ళీ చిత్ర బృందం తిరిగి ముంబై చేరుకుంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన గ్రీన్ మ్యాట్ సెట్లో ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్స్ ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తుండగా రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కి ముందు 30శాతం షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ఓంరౌత్ స్వయంగా తెలిపాడు. ఇక ఇప్పటికే ఆదిపురుష్ 3డి 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని వెల్లడించారు. ఆ దిశగానే షూటింగ్ ప్లాన్ చేశారు. ప్రభాస్ కూడా ఒకవైపు రాధే శ్యాం, సలార్ పూర్తి చేస్తూనే ఆదిపురుష్ 3డి ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
Prabhas : ఆదిపురుష్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు దర్శక దిగ్గజం ఓంరౌత్.
ఇక ఆదిపురుష్ షూటింగ్ ముంబైలో సాగుతుండగా ప్రభాస్ లేకుండా, రావణాసురుడు పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేసిన రావణ లంక సెట్ లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రావణ పాత్రకి సంబంధించిన కీలక సన్నివేశాల్లో సైఫ్ అలీఖాన్ తో పాటు ప్రభాస్ జాయినవుతారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ ప్రభాస్ తో ప్లాన్ చేశారట. కాగా ఆదిపురుష్ 3డిని భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు దర్శక దిగ్గజం ఓంరౌత్.