బాహుబలితో భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త నిర్వచనం చెప్పాడు ప్రభాస్. అలానే తెలుగు ఖ్యాతిని యావత్ ప్రపంచానికి వ్యాప్తి చేయడంలో ప్రభాస్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్గా సూపర్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో కలిసి సలార్ చిత్రంలో నటిస్తున్నాడు. అలానే ప్రభాస్… డైరెక్టర్ మారుతితో ఓ ఫ్యామిలీ మూవీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది సినీ సర్కిల్ టాక్. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ.. ఒక విషయం ఫ్యాన్స్ను ఆందోళన పడేలా చేస్తుంది.
Prabhas: ఫ్యాన్స్లో భయం
ప్రభాస్ ఫ్యాన్స్ మారుతితో సినిమా తీయడం రిస్క్ తీసుకోవడమేనని భావిస్తున్నారు. ఎందుకంటే తాజాగా మారుతి డైరెక్ట్ చేసిన పక్కా కమర్షియల్ మూవీ డిజాస్టర్గా నిలిచింది. కుళ్లు కామెడీతో గోపీచంద్ ను నిండా ముంచేశాడు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ విషయంలో కూడా అలానే జరుగుతుందేమో అని కొందరు ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
మూవీ బ్యాక్డ్రాప్ ఇదేనా
ఈ నేపథ్యంలోనే సినిమా స్టోరీ లైన్ ఇదే అని సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ఒక కథ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా ప్రకారం… ప్రభాస్, మారుతి కాంబోలో వచ్చే మూవీ ఒక హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా ఒక బంగ్లా చుట్టూ తిరుగుతుంది. ఆ బంగ్లా ఒక పాడుబడ్డ థియేటర్ అట. ఆ థియేటర్ పేరు రాజా డీలక్స్. అందుకే సినిమా టైటిల్ కూడా రాజా డీలక్స్ అని ఖరారు చేసినట్లు వీళ్లు చెబుతున్నారు. ఈ థియేటర్లోనే క్యారెక్టర్ల మధ్య కథ నడుస్తుందని.. అక్కడే కామెడీ, భయం అన్నీ జనరేట్ అవుతాయని చెబుతున్నారు. ఇలాంటి స్టొరీలైన్తో వచ్చే మూవీ ఆడియన్స్ను వేరే లెవెల్లో అలరిస్తుందని అంటున్నారు. మరి మూవీ ఏ కథతో వస్తుందో చూడాలి. ఈ మూవీ కోసం మారుతి ఇతర రచయితల హెల్ప్ కూడా తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారని టాక్. దసరా సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించవచ్చని చిత్రసీమ నుంచి వినవచ్చింది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది.