సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన నటిస్తున్న సినిమాలకి నిర్మాణంలో భాగస్వామిగా ఉంటున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం సినిమా నుంచి మహేష్ నటిస్తున్న సినిమాలకి జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ని జోడించి తాను ఒక నిర్మాతగా వ్యవహరిస్తు వస్తున్నాడు. ఇప్పుడు కూడా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్స్ తో కలిసి సర్కారు వారి పాట సినిమాకి నిర్మాణ భాగ స్వామిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే తన సొంత బ్యానర్ లో బయట హీరోలతోను సినిమాలు నిర్మిస్తున్నాడు మహేష్.
ఈ క్రమంలోనే ‘మేజర్’ అనే సినిమాని నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకి సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ ప్రొడక్షన్ హౌసెస్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో వర్స్టైల్ హీరో అడవి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. కాగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఈ పాన్ ఇండియా సినిమా అన్ని సినిమాల మాదిరిగా కరోనా కారణంగానే షూటింగ్ ఆగిపోయింది. దాదాపు ఆరు నెలలుగా ఆగిపోయిన ‘మేజర్’ షూటింగ్ తిరిగి ప్రారంభించారని తాజా సమాచారం. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా బాధ్యత మొత్తం మహేష్ అండ్ టీమ్ హీరో అడవి శేష్ కి అప్పగించినట్లు తెలుస్తుంది. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ – స్క్రీన్ ప్లే తో పాటు సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ మీద మంచి అవగాహన ఉన్న విషయం తెలిసిందే.
మాస్ ఇమేజ్ రావాలి, లవర్ బాయ్ గా క్రేజ్ సంపాదించుకోవాలన్న ఆరాటం లేకుండా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న కథ లని కాకుండా పూర్తి వైవిధ్యభరితమైన కథలని ఎంచుకుంటూ తనకంటు టాలీవుడ్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని సాధించాడు. అందుకే మహేష్ అండ్ టీమ్ ఈ సినిమా విషయంలో హీరో, డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చేశారని తెలుస్తోంది. మహేష్ – నమ్రత నమ్మి ఈ సినిమా బాధ్యత అప్పగించడంతో శేష్ మరింత కేర్ తీసుకుంటున్నాడట.