“రాధేశ్యామ్” సినిమాకి సంబంధించి మొదటి నుండి అభిమానులకు నిరాశ కలిగే విధంగానే సిచువేషన్ లు ఉన్నాయి. “సాహో” సినిమా అట్టర్ ప్లాప్ అయిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా ప్రకటించి అసలు సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతుందా లేదా అన్నది బయట ప్రపంచానికి తెలియకుండా కానిచ్చేశారు. దాదాపు కొన్ని నెలలపాటు సినిమాకి సంబంధించిన ఫోటో గాని ఎటువంటి అప్ డేట్ బయటకు రాలేదు.
తర్వాత ప్రభాస్ పుట్టిన రోజు నాడు సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేశారు . అప్పటి వరకూ ప్రభాస్ అభిమానులు “రాధేశ్యామ్” సినిమా యూనిట్ పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఇప్పుడు సినిమాకి సంబంధించి టీజర్ విషయంలో కూడా ఇదే రీతిలో సినిమా యూనిట్ వ్యవహరించడంతో అభిమానులు సీరియస్ అవుతున్నారు.
లాక్ డౌన్ తర్వాత ఒకపక్క మిగతా హీరోల సినిమాలు మరియు టీజర్ లు రిలీజ్ అవుతున్న తరుణంలో “రాధేశ్యామ్” టీజర్ రిలీజ్ కాకపోవడం పట్ల ఆగ్రహం చెందుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ అవుతున్నట్లు సినిమా యూనిట్ అభిమానులను ఊరించగా.. అది కాస్తా ఆవిరైపోయింది. సంక్రాంతి పండుగ కైనా రిలీజ్ అవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో సినిమా యూనిట్ పై ఆగ్రహం చెందుతూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!