Prabhas: ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్ మరియు సలార్ సినిమాల షూటింగ్ లతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందని చిత్త్ర బృందం వెల్లడించింది. ప్రేమికుల దినోత్సవము రోజున ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్సె కూడా విడుదల చేశారు.
ఇవి ఇలా ఉండగా ఈ మూడు సినిమాలతో పాటుగా ప్రభాస్ త్వరలోనే ‘మహానటి’ డైరెక్టర్ నాగఅశ్విన్ దర్శకత్వంలో కూడా నటించనున్నాడు. ఈ సినిమాను అశ్విని దత్ టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కనున్నది. కాగా, బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే మరియు అమితాబచ్చన్ ఈ సినిమాలో కనిపించనున్నారు.
అయితే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పిట్టకథలు వెబ్ సిరీస్ లోని X – Life ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఈ సిరీస్ కి వచ్చిన నెగటివ్ టాక్ ని పరిగణలోకి తీసుకుని ప్రభాస్ ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. X – Life కూడా సైన్స్ ఫిక్షన్ జోనర్ లోనే రూపొందడం ఇందుకు ప్రధాన కారణం. కానీ ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నాగ్ అశ్విన్ ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని ఇది చాలా కాలం నుంచి రాసుకుంటున్న స్క్రిప్ట్ అని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా రిలీజ్ తర్వాత గర్వపడతారని ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సినిమాలోని పాత్రలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయన్న నమ్మకం ఆయనకు ఉందని చెప్పారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.