యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే. 15 రోజుల షెడ్యూల్ కోసం రీసెంట్ గా ఇటలీ చేరుకున్న చిత్ర యూనిట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత తిరిగి ఇండియా వచ్చి నాన్ స్టాప్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ జరపనున్నారని సమాచారం. కాగా ప్రభాస్ నటించబోతున్న భారీ బడ్జెట్ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
ప్రభాస్ బాలీవుడ్ దర్శ దిగ్గజం ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాని దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో 3-డీ లో టీ-సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించబోతున్నాడు. లంకేష్ గా సైఫ్ అలీఖాన్ నటించబోతున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ మూడు పాత్రలలో కనిపించబోతున్నాడట. ఓ సోషియో ఫాంటసీ ఎలిమెంట్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన సన్నివేశాలలో రామాయణంకి సంబంధించిన ఒక ఎపిసోడ్ కూడా ఉండబోతుందని ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలవనుందని తెలుస్తుంది.
ఇక ‘ఆదిపురుష్’ ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా తెరకెక్కనుండగా 2021 లో చిత్రీకరణ ప్రారంభించి 2022లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించి.. తమిళం – మలయాళం – కన్నడ భాషలలో పాటు పలు విదేశీ భాషల్లోకి డబ్ చేనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా నటించే సీత పాత్రకోసం తీవ్రమైన అన్వేషణ సాగుతోందట.