“సాహో” సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా “రాధేశ్యామ్” అని అందరికీ తెలుసు. జీల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. పాతకాలం నాటి ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మొట్టమొదటిసారి స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే నటించడంతో సినిమాపై అభిమానులకు అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ గతంలో దీపావళి సందర్భంగా రిలీజ్ చేసి సినిమాపై అందరికీ ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో డిజైన్ చేయడం జరిగింది. పైగా ఈ సినిమాకి ఏకంగా 150 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించడంతో ఈ తరహా లవ్ స్టోరీ వీరిద్దరి మధ్య నడుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే కొత్త ఏడాది సందర్భంగా ప్రభాస్ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన మరో లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ పోస్టర్ ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ రావటం లేదు. పైగా ఈ పోస్టర్ లో ప్రభాస్ ఇచ్చిన స్టిల్ చూసి 2005వ సంవత్సరంలో రిలీజ్ అయిన పౌర్ణమి సినిమాని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. చత్రపతి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన పౌర్ణమి సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. అంత మాత్రమే కాక ప్రభాస్ కెరీర్లో దారుణమైన డిజాస్టర్ సినిమాగా నిలిచింది. అయితే తాజాగా కొత్త సంవత్సరం కానుకగా రాధేశ్యాం యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ పౌర్ణమి సినిమా లో ప్రభాస్ లుక్ తలపించే రీతిగా ఉండటంతో అభిమానులలో టెన్షన్ నెలకొంది. మరోపక్క ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోంది.