బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తే అతి పెద్ద డిజాస్టర్ తన కెరీర్ లో నమోదు చేసుకోవడం తెలిసిందే. కాగా సాహో సినిమా చేస్తుండగానే.. రాధేశ్యామ్ ప్రాజెక్టు ప్రభాస్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిలో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ గాని సినిమా షూటింగ్ విషయాలు గానీ చాలా వరకు బయటకు రాలేదు.
ఆ సమయంలో “సాహో” తర్వాత ప్రభాస్ సినిమా చేస్తున్నాడా.. లేకపోతే గ్యాప్ ఇస్తున్నాడా అనే సందేహాలు ప్రతి ఒక్కరి లో నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ తన పుట్టిన రోజునాడు సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ పిక్ రిలీజ్ చేసి… ఫాన్స్ కి ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్.. కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ అవుతుందని భావించిన ఫ్యాన్స్ కి నిరాశ ఎదురవ్వగా సంక్రాంతి పండుగకి కూడా రిలీజ్ కాకపోవడంతో డీలా పడిపోయారు.
ఫ్యాన్స్ పరిస్థితి ఇలా ఉండగా సినిమా యూనిట్ కి మాత్రం ప్రభాస్ దిమ్మతిరిగే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. మేటర్ లోకి వెళ్తే రాధేశ్యామ్ సినిమా యూనిట్ కి… ప్రతి ఒక్కరికి ఖరీదైన చేతి గడియారం గిఫ్ట్ గా ప్రభాస్ ఇవ్వటంతో అభిమానులు అదేవిధంగా యూనిట్ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకొని ప్రభాస్ అభిమానులు మా డార్లింగ్ మనసు బంగారం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?