డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ లో నటిస్తున్న 20 చిత్రం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాని యువి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా ప్రభాస్ పెదనాన్న సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పక్కా ప్లాన్స్ తో విదేశాలలో షూటింగ్ జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసుకొని షూటింగ్ వెళ్ళి కరోనా కారణంగా అనుకున్న షెడ్యూల్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
అయితే ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా నుండి టైటిల్, అలాగే ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఆశించారు. కాని గత మూడు నెలలుగా చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ విషయంలో ప్రభాస్ కూడా స్పందించలేదు. దాంతో ప్రభాస్ కొంత అసహనానికి లోనయ్యారు. ఎలాగన్న డార్లింగ్ నుంచి గుడ్ న్యూస్ రావాలని ఒత్తిడి చేశారు. దాంతో లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉన్న ప్రభాస్ సైలెంట్ గా ఫ్యాన్స్ కోసం భారీ సర్ప్రైజ్ లను ప్లాన్ చేశాడట.
తన మీద ఎంతో అసహనంగా ఉన్న ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇప్పటికే తన 20 వ సినిమా కి సంబంధించిన ప్రభాస్ లుక్ రానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆనందం మామూలుగా లేదు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ 21 సినిమాగా రూపొందబోయో నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా నుండి అదే రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ని ప్రభాస్ సిద్దం చేసినట్టు తెలుస్తుంది. మరి అది ఏంటన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.