Adipurush : ఆదిపురుష్ తో పాటు సలార్ అన్న భారీ యాక్షన్ సినిమాలో కూడా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు రాధే శ్యాం సినిమాని రిలీజ్ కి సిద్దం చేస్తూనే మరొకవైపు సలార్, ఆదిపురుష్ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ఇప్పటికే సలార్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. శృతి హాసన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుందని సమాచారం. కేజీఎఫ్ సినిమాలతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబై వెళ్ళనున్నాడని తాజా సమాచారం. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రాముడిగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తుండగా మరో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని ఆదిపురుష్ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముంబై మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గానూ మారింది. కాని ఇంకా మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రావడం లేదు.
Adipurush : ఆదిపురుష్ సలార్ సినిమాలు కంప్లీట్ చేసి నాగ్ అశ్విన్ సినిమాతో సెట్స్ మీదకి రాబోతున్నాడు ప్రభాస్.
కాగా ఆదిపురుష్ సినిమాలో ఉన్న ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రభాస్ ముంబై వెళుతున్నాడట. ఈ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ చేసి మళ్ళీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ షూటింగ్ కోసం హైదరాబాద్ రానున్నాడని సమాచారం. ఇక ఆదిపురుష్ సినిమా దాదాపు 650 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు కంప్లీట్ చేసి నాగ్ అశ్విన్ సినిమాతో సెట్స్ మీదకి రాబోతున్నాడు. వైజయంతీ మూవీస్ 50 వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.