ప్రభాస్ నుంచి ఇప్పుడు ఒక సినిమా రావాలంటే కనీసం సంవత్సరం పైనే పడుతోంది. కారణం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ కేటగిరీలో తెరకెక్కుతుండటమే. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ఒక్కో సినిమాకి కనీసం సంవత్సరం కి ఎక్కువగానే సమయం తీసుకుంటున్నాడు. సాహో తర్వాత ఆ గ్యాప్ రాకుండా చూస్తానని మాటిచ్చినప్పటికి కరోనా కారణం గా రాధే శ్యామ్ కి మళ్ళీ బాగానే గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు సలార్ విషయం లో అంత గ్యాప్ రాకుండా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట ప్రభాస్.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా చివరి దశలో ఉంది. ఇంతలోనే మరో సలార్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలసి ప్రభాస్ ‘సలార్’ చేస్తున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ని తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. కాగా తాజా సమాచారం ప్రకారం సలార్ సినిమా షూటింగ్ ఈ సంక్రాంతి తర్వాత మొదలవబోతోందట. అంతేకాదు ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని కేవలం నాలుగు నెలలలో పూర్తి చేయాలని ప్రశాంత్ – ప్రభాస్ గట్టిగా ఫిక్సైనట్టు తెలుస్తోంది.
అయితే ప్రభాస్ చేస్తున్న సినిమా అంత త్వరగా కంప్లీట్ చేయగలరా అన్న మాట వినిపిస్తోందట. కాని ప్రభాస్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సినిమాలు నాలుగు నెలల్లో కంప్లీట్ చేశారు. అలాగే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ కూడా పక్కా షెడ్యూల్ ప్లానింగ్ తో మే చివరి వరకు షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారట. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు ఎడిటింగ్ డబ్బింగ్ వంటి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ని కంప్లీట్ చేసేలా దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ప్లానింగ్ తోనే విజయదశమి కి సలార్ ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.