Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ (salaar) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 1970 బ్యాక్డ్రాప్ తో వస్తోందని సమాచారం. సినిమా కథ మైసూర్ రాష్ట్రంలో బ్రిటీష్ రాజ్ పరిపాలన సమయం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. సలార్ కథ యష్, శ్రీనిధి శెట్టి నటించిన యాక్షన్ డ్రామా KGF తరహాలో ఉందని నివేదికలు కూడా వస్తున్నాయి. ఈ చిత్రంలో జగపతి బాబు రాజ మన్నార్ అనే పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా సలార్ సినిమా ని ఉద్దేశించి “భయమేస్తోంది” అని జగపతి బాబు సంచలన కామెంట్ చేశారు. దీనితో అభిమానులు టెన్షన్ లో పడ్డారు.
Prabhas : ఇంతకీ జగపతి బాబు అలా ఎందుకు అన్నాడు
సలార్ సినిమాలో జగపతి పాత్రకు సంబంధించిన లుక్ ఇటీవలే విడుదల చేశారు. అయితే ఈ పాత్ర గురించి తాజాగా జగపతిబాబు ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా పాత్రకు సంబంధించిన లుక్ చాలా వెరైటీగా ఉండాలని ఏవేవో ప్రయత్నాలు చేశారు. అయితే ఆ లుక్ బాగానే వచ్చింది. కానీ షూటింగ్ సమయానికి అది ఎలా మారుతుందో.. సినిమాలో ఎలా కనిపిస్తుందో తెలియాలి. అందుకే ఇప్పుడు నాకు సలార్ సినిమాను తలుచుకుంటేనే భయమేస్తోంది. ఆ పాత్ర ఎలా మారబోతోందో ఊహించుకుంటేనే కాస్త టెన్షన్ గా అనిపిస్తోంది. నా క్యారెక్టర్ రాజమన్నార్, లుక్ కు సరైన న్యాయం చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను డైరెక్టర్ ప్రశాంత నీల్పై పూర్తి నమ్మకం ఉంచాను.” అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.
టెన్షన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, శ్రుతి హాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్ పై ‘సలార్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి అంకంలో ఉంది. ఇప్పటివరకైతే జగపతి బాబు రాజ మన్నార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో జగపతిబాబు నెగిటివ్ వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Prabhas: ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై ఇంత పెద్ద రూమర్ ఏంట్రా బాబూ..!