రెబెల్ స్టార్ ప్రభాస్ వరస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రభాస్ తన ఫ్యాన్స్ కు తీపి కబుర్లు వినిపించాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో తిరిగి మొదలుకానుంది.
ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాను చేయాల్సి ఉంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడు. ఇందులో రాముడి పాత్రను చేయనున్నాడు ప్రభాస్. సాయి అలీ ఖాన్ ప్రభాస్ కు విలన్ గా రావణాసురుడి పాత్ర పోషించనున్నాడు. ఇలా వరస అప్డేట్స్ తో తన ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీనిచ్చాడు ప్రభాస్. వరసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు చేయడం కూడా ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ లేటెస్ట్ పోస్టర్ ఒకటి ఇప్పుడు ఫ్యాన్స్ ను కుదురుగా ఉండనివ్వట్లేదు. ప్రభాస్ ఫుల్ స్టైలిష్ లుక్ లో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాడు. కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా ఈ పోస్టర్ ను షేర్స్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. మరి ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాలు కూడా విడుదలైతే ప్రభాస్ రేంజ్ ఎంతలా మారిపోతుందో చూడాలి.