కరోనా కొట్టిన దెబ్బకి అన్ని చిత్ర పరిశ్రమలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోను షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విదేశాలలో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న ప్రభాస్ సినిమా, పూరి – విజయ్ దేవరకొండ సినిమా, సుకుమార్ – అల్లు అర్జున్ సినిమాల తో పాటు మరికొన్ని సినిమాలు అర్ధాంతరంగా చిత్రీకరణలు నిలిపివేసి ఇండియాకి తిరిగి వచ్చరు.
అయితే మళ్ళీ ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమా షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్లు జరుపుకున్న సినిమాల.. బ్యాలన్స్ షూటింగ్స్ ని హైదరాబాద్ స్టూడియొస్ లోనే సెట్స్ వేసి చిత్రీకరించాలని ఆయా చిత్రాల యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు విదేశాల్లోనే కరోనా భయం అంత ఎక్కువగా లేదని తెలియడంతో.. మళ్ళీ విదేశాల్లోనే చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమం లో ‘రాధే శ్యామ్’ టీం కూడా ఉన్నట్టు సమాచారం.
లాక్ డౌన్ కు ముందు ‘రాధే శ్యామ్’ షూటింగ్ ఇటలీలో చాలా వరకూ జరిపారు. కరోనా ప్రభావం వల్ల.. హైదరాబాద్ లో కొన్ని సెట్స్ వేసి.. ఇటలీకి మ్యాచ్ అయ్యే ఇండోర్ సీన్స్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఒరిజినాలిటీ మిస్ అవుతుందని కొన్ని కీలక సన్నివేశాల కోసం ‘రాధే శ్యామ్’ టీం మళ్ళీ ఇటలీ వెళ్ళడానికి రెడీ అవుతున్నారట. అందుకోసం 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట.
అందుకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం, వీసా ఏర్పాట్లు కూడా సిద్దమయినట్టు.. అక్టోబరు మొదటి వారంలో ‘రాధే శ్యామ్’ టీం ఇటలీ వెళ్లబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 15 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగొచ్చి… హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ లలో బ్యాలన్స్ షూటింగ్ జరుపుతారని సమాచారం. ‘రాధే శ్యామ్’ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆదిపురుష్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.