Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసేశాడు. వరుసగా నాలుగు సినిమాలు అతనివి మరొక రెండు సంవత్సరాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం కే జి ఎఫ్ డైరెక్టర్ తో ‘సలార్’ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మరొకవైపు ఓంరౌత్ `ఆదిపురుష్ 3డి` ప్రిపరేషన్ జరుగుతోంది. ‘రాధే శ్యామ్’ ఇప్పటికేవిడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా అప్డేట్స్ మధ్యలోనే వైజయంతి మూవీస్ సంస్థ పెద్ద ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళితే…. ప్రభాస్ కథానాయకుడిగా అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కథానాయికగా… అంతేకాకుండా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర పోషిస్తారని ఈరోజున ఒక పోస్టర్ ద్వారా వైజయంతి మూవీస్ వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుల వివరాలను విడుదల చేస్తూ వైజయంతి మూవీ వారు ఒక పోస్టర్ విడుదల చేశారు.
హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మహానటి’ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు. వరుసగా అతను తెలుగులో రెండవ సినిమా నాగ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అంతేకాకుండా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, కొత్తబంగారులోకం లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. వీరి పేర్లతో పోస్టర్ రిలీజ్ చేసిన వైజయంతి మూవీస్ మహానటి సినిమాకి పనిచేసిన వారిని ఈ సినిమా కి కంటిన్యూ చేయడం నిజంగా ఆశ్చర్యమే చెప్పాలి.
దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియా లెవెల్ లో ఈ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం వెనుక ఉన్న చిత్రాలను గమనించినట్లైతే ఒక కొత్త ప్రపంచాన్నే ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘అవతార్’ రేంజ్ లో ఉన్నాయి ఆ కట్టడాలు. సైన్స్ ఫిక్షన్ సినిమాకి ఫోటోగ్రఫీ చాలా ముఖ్యం. ఈ చిత్రానికి కూడా డానీ ని అందుకే చేసుకున్నారు. ‘మహానటి’ విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో అందరం చూశాం. ఇక సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కోసమే మళ్ళీ ఇలాంటి టెక్నిషియన్ తో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Prabhas కోసం ఇండస్ట్రీ బెస్ట్
ఇక ఇండస్ట్రీ బెస్ట్ టెక్నీషియన్స్ దేశంలోనే అతి పెద్ద స్టార్స్ తో సినిమా చేస్తున్న నాగ్ అశ్విన్ ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసాడు. ఇక ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నాము అన్నట్లు వైజయంతి మూవీస్ వారు ఈ పోస్టర్ ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?