Prabhas: డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో బాలకృష్ణ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన “ఆదిత్య 369” టైం మిషన్ మాదిరిగా ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే అదే రీతిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఉండటం జరిగింది.
ఈ సినిమా గత లాక్ డౌన్ టైంలో ప్రకటించగా ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ కాకపోవడం తో సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. పైగా ప్రభాస్ కెరీర్లో ఇదే హై బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఇదే అంటూ సరికొత్త టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళితే ఈ సినిమాకి టైటిల్ “కలియుగ్” అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఖరారు చేసినట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు సరికొత్త టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.
Read More: Prabhas: హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి రెడీ అవుతున్న ప్రభాస్..!!
అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన కెమెరాలతో ఈ సినిమా షూటింగ్.. జరిపించడానికి నాగ్ అశ్విన్ రెడీ అవ్వడం జరిగింది. సినిమా మొత్తానికి ప్రొఫెషనల్ కెమెరాలు హాలీవుడ్ నుండి.. దింపుతున్నారు. ఒక్కొక్క కెమెరా అద్దె వారానికి కొన్ని కోట్లు అన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా టైం మిషన్ తరహాలో స్పైడర్ మాన్, సూపర్ మ్యాన్ వంటి సినిమాల కంటే భిన్నంగా ప్రభాస్ నీ.. ఈ సినిమాలో డైరెక్టర్ చూపించనున్నట్లు సమాచారం.