Nagarjuna: నాగార్జున, ప్రభాస్.. వయస్సులో తేడా వున్నా, అందంలోనూ.. హైట్ లోను సరిసమానంగా ఉంటారని చెప్పడంలో సందేహమే లేదు. నడి వయస్సులోనూ కింగ్ నాగార్జున దుమ్ము దులిపేస్తున్నాడు. తన కొడుకులతో పోటీ పడుతూ నటిస్తున్నాడు. త్వరలో బంగార్రాజుగా వెండితెరపైన అలరించనున్నాడు. ఇక ప్రభాస్ ప్రస్తావన అవసరం లేదేమో. బాహుబలి తరువాత ప్రభాస్ జీవితం మారిపోయింది. రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇపుడు డార్లింగ్ కి వున్న మార్కెట్ ఇండియాలో ఇంకే హీరోకి లేదని సమాచారం.
వీరు ఏ విషయంలో ముందున్నారు?
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది. ఈ ఆదివారం ఎపిసోడ్ లో MP సంతోష్ కుమార్ సందడి చేసిన విషయం తెలిసినదే. ఆయన అక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు. ఆ మాటలు విని ఎమోషనల్ అయిన హోస్ట్ కింగ్ నాగార్జున స్పందిస్తూ.. ‘అడవిని దత్తత తీసుకోవచ్చా’ అంటూ అడిగాడు. అంతటితో ఆగకుండా తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకుంటాను అంటూ బహిరంగంగా ప్రకటించాడు. దాంతో ఒక్కసారిగా ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లి పోయింది. అక్కడే వున్న సంతోష్ నాగ్ ను మెచ్చుకున్నారు.
అదేపని ప్రభాస్ ఆల్రెడీ చేశాడా?
అవును.. ఇప్పటికే MP సంతోష్ ఆధ్వర్యంలో ప్రభాస్ కొన్ని వందల ఎకరాల అడవిని దత్తత తీసుకున్నారు. అలాగే ఆ అడవికి కావాల్సిన నిధులను సమకూర్చి ఇచ్చారట. ఇకపోతే రాను రాను పెరిగి పోతున్న గ్లోబల్ వార్మింగ్ తో భూమి వేడెక్కిపోతుంది. వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. అనేక చోట్ల వున్న అడవుల్ని నరికేస్తున్నారు. అది సరిపోవడం లేదంటూ జనాలకు హాని చేసే పరిశ్రమలు నెలకొల్పి పర్యావరణ కాలుష్యానికి కారకులు అవుతున్నారు కొందరు ప్రభుద్దులు. ఇలాంటి తరుణంలో అడవులపైన దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా వుంది.