రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. సాహో తర్వాత మరోసారి ప్రభాస్ కెరీర్ లో భారీ గ్యాప్ వస్తోంది. అందుకే ఈసారి అలాంటి తప్పు జరగకుండా ప్రభాస్ వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ చేస్తున్నాడు ప్రభాస్. ఇది ఒక పీరియాడిక్ లవ్ డ్రామా.
దీని తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఇది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇప్పుడు ప్రభాస్ మరో డిఫరెంట్ మూవీను ట్రై చేస్తున్నాడు. ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో కలిసి సినిమా చేయనున్నాడు. ఈసారి మైథలాజికల్ సినిమాను అటెంప్ట్ చేస్తున్నాడు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీన్ని వర్ణించారు. చూస్తుంటే మన ఇతిహాసం రామాణయాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆది పురుష్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో ఎలా ఉంటాడా అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.