Radhe shyam: ఇప్పుడు అందరికీ ఉన్న టార్గెట్ ఆర్ఆర్ఆర్ సినిమానే. ఈ సినిమా వసూళ్ళను దాటిపోవాలని దాదాపు పెద్ద సినిమాలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఇండియాతో పాటు విదేశాలలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎక్కువగా అన్నీ విషయాలలో పోటీ పడుతుంది మాత్రం పాన్ ఇండియన్ సినిమా ‘రాధేశ్యామ్’. సంక్రాంతికి అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజ్ అయ్యేది. కానీ, ఇప్పుడు రీ షెడ్యూల్ అయ్యాక దానికంటే ముందే ప్రభాస్ తన ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని భారీ స్థాయిలో తీసుకు రాబోతున్నాడు.
వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడమే ఇప్పుడు ప్రభాస్ పెట్టుకున్న గట్టి టార్గెట్ అని తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్న వార్త చూస్తే అర్థమవుతోంది. ఒక తెలుగు స్టార్ హీరో నటించిన సినిమాను ఏకంగా 10 వేల థియేటర్స్ లో విడుదల చేయడం అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. వాస్తవంగా ఈ రేంజ్లో రాజమౌళి తన దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు.
Radhe shyam: ప్రభాస్ తన అన్నీ విషయాలలో ఆర్ఆర్ఆర్ మూవీ సరసన చేర్చాలనుకుంటున్నారు.
కానీ, ఆ సినిమా కంటే ముందే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అత్యంత భారీగా 7 భాషలలో మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్లలో ప్రేక్షకూల్ ముందుకు తీసుకు రానున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమాను ఒక్క నార్త్ అమెరికాలోనే 2 వేల థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. వాస్తవంగా ఈ స్థాయిలో రిలీజ్ అంటే అంత తేలికైన విషయం కాదని చెప్పాలి. ఇదే జరిగితే వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు ప్రభాస్ తన ‘రాధేశ్యామ్’ సినిమా అన్నీ విషయాలలో ఆర్ఆర్ఆర్ మూవీ సరసన చేర్చాలనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.