ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా డామేజ్ జరిగిన సినిమా అంటే రెబల్ స్టార్ ప్రభాస్ దే అని చెప్పాలి. ప్రారంభంలో అనుకున్నదానికంటే సాహో ఎఫెక్ట్ తో కొంత కథ లో మార్పులు చేసిన చిత్ర బృందం బడ్జెట్ ని తగ్గించేసింది. ఆ తర్వాత విదేశాలలో షూటింగ్ ప్లాన్ చేసుకొని అంతా రెడీ అయ్యాక ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే కి ఆరోగ్యం బాగాలేక ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. దాంతో అప్పుడు కొంత బడ్జెట్ వేస్ట్ అయిందట.
ఇక లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా ఉన్న పలంగా ఇండియాకు తిరిగివచ్చేశారు. దాంతో అక్కడ సెట్ వేసి అనుకున్న టాకీ పార్ట్ కంప్లీట్ చేయలేకపోయారు. అదే టాకీ పార్ట్ ని హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారట. అప్పుడే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ .. ప్రభాస్ ల మీద కొన్ని కీలక సన్నివేశాలని కంప్లీట్ చేశారట దర్శకుడు.
అయితే తాజా సమాచారం ప్రకారం లాక్ డౌన్ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ టాకీ పార్ట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన సెట్ ని కూడా నిర్మిస్తున్నట్టు త్వరలో ఆ సెట్ రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. ఇక్కడే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసే విధంగా ప్రభాస్ బృందం సన్నాహాలు చేస్తున్నారట. జిల్ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాని పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సాగే రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకి జాన్, రాధే శ్యామ్ అన్న టైటిల్స్ పరిశీలనలో ఉండగా భాగ్యశ్రీ ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తున్నట్టు సమాచారం.