Prabhas : డార్లింగ్ హీరో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ పూజ హెగ్డే మధ్య చిన్నపాటి మనస్పర్థలు చోటు చేసుకున్నాయట. ఇపుడు ఇవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Prabhas : పూజా హెగ్డే సారీ చెప్పింది!
షూటింగ్ సమయంలో పూజా హెగ్డే ప్రవర్తన నచ్చక ప్రభాస్ తనతో గొడవ పడ్డారని చిత్ర యూనిట్ సమాచారం. దీంతో ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారట. ఇకపోతే ఈ విషయంలో పూజా హెగ్డే తాజాగా ప్రభాస్ కి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పూజా హెగ్డే ప్రభాస్ కి సారీ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయని, సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారని తెలుస్తోంది.
ఆ విషయం ప్రెస్ మీట్ లోనే చెప్పిందా?
అయితే ఈ విషయం పూజ ప్రెస్ మీట్ లోనే చెప్పిందని భోగట్టా. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య వచ్చే మనస్పర్థలు తొలగిపోవడంతో ముఖ్యంగా డార్లింగ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 11వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికం నిపుణుడిగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు.