‘ఆర్.ఆర్.ఆర్’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన భారీ మల్టీస్టారర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పోరాట యోధులైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమరం భీం ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఓలియా మోరిస్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 న మొదలైన ఆర్ ఆర్ ఆర్ రీసెంట్ గా లాంగ్ షెడ్యూల్ తో పాటు మహాబలేశ్వర్ లో చిన్న షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నారట. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని 2021 మార్చి కి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ కి రిలీజవడం పక్కా అని తెలుస్తోంది.
అయితే అదే సమయానికి ప్రభాస్ రాధే శ్యాం పోటీకి దిగే అవకాశాలున్నాయని సమాచారం. మరో రెండు వారాల్లో ప్రభాస్ రాధే శ్యాం షూటింగ్ కంప్లీట్ అవుతుందట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ అవుతునాయి. కాస్త వీఎఫెక్స్ కి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే కాస్త అటు ఇటుగా ఆర్ ఆర్ ఆర్ కి పోటీ నే అని అంటున్నారు. అయితే ఇలా రెండు భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియన్ సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తే వసూళ్ళ మీద తీవ్రంగా ప్రభావం పడే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. ఇక ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?