Prabhas : ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సలార్ రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. రామగుండం లో కోల్ మైన్స్ లో 10 రోజుల పాటు ఒక షెడ్యూల్ ని ఫినిష్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్ లో ఛేజింగ్ సీన్స్, యాక్షన్స్ సీన్స్ ని తెరకెక్కించారు. కాగా పెద్ద గ్యాప్ లేకుండానే సలార్ సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు చిత్ర యూనిట్. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సలార్ సెకండ్ షెడ్యూల్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతోందని తాజా సమాచారం.
సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా సెకండ్ షెడ్యూల్ కాస్త లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది. ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని కీలకమైన సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడట. ఇక ఈ సినిమాని భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఉగ్రం సినిమా కి రీమేక్ అని ప్రచారం అవుతోంది.
Prabhas : సలార్ కి ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
కాగా ప్రభాస్ ఈ సినిమాకి కేవలం 35 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాని 100 రోజుల్లో టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసేందుకు పక్కా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఇక సలార్ కి ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. సలార్ కి ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం అవుతోంది. కాగా రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ – పూజా హెగ్డే నటిస్తున్న రాధే శ్యాం రిలీజ్ కి రెడీ అవుతోంది.
జూలై 30 న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు దర్శక, నిర్మాతలు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?