Prabhas : ప్రభాస్ Prabhas సలార్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు ప్రశాంత్ నీల్. అనుకున్నది అనుకున్నట్టుగా ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ని ఫినిష్ చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రభాస్ తో ఇంత స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న దర్శకుడు పూరి జగన్నాధ్ తర్వాత బహుషా ప్రశాంత్ నీల్ మాత్రమే అంటున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో పూరి జగన్నాధ్ ఇప్పటికే రెండు సినిమాలు తీశాడు. ఈ రెండు సినిమాలు కూడా దాదాపు 4 నుంచి 5 నెలల్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. అప్పటికి ఇప్పటికి మారింది ఏదైనా ఉందంటే ప్రభాస్ రేంజ్ అండ్ మార్కెట్.
అయితే వీఎఫెక్స్ వర్క్ గనక లేకపోతే ప్రభాస్ కూడా సినిమాకి బల్క్ డేట్ ఇచ్చి గట్టిగా 5 నుంచి 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకులముందుకు తీసుకు వస్తాడు. ఆ విషయం తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సలార్ తో అర్థమవుతోంది. ఈ రకంగా చూస్తే గ్యారెంటీగా ప్రశాంత్ నీల్ చెప్పినట్టు 4 నుంచి 5 నెలల్లో టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తారనిపిస్తుంది. అంత స్పీడ్ గా సలార్ చిత్రీకరణ సాగుతోంది. ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్ రామగుండం కోల్ మైన్స్ లో కంప్లీట్ చేశారు. 10 రోజులు ప్లాన్ చేసిన ఈ ఫస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు శృతి హాసన్ కూడా పాల్గొందని సమాచారం.
Prabhas : త్వరలోనే హైదరాబాద్ లో సలార్ భారీ షెడ్యూల్ ..?
ఇక సలార్ లో ప్రభాస్ కార్మికుడి పాత్రలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా ముగిసిన షెడ్యూల్ లో యాక్షన్ సీన్ తో పాటు శృతి హాసన్ ని కిడ్నాప్ చేసే సీన్స్ ని షూట్ చేశారట. శృతి హాసన్ ని కిడ్నాప్ చేసిన సమయంలో ఛేజ్ చేసి కాపాడే సీన్స్ కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడట. ఇక త్వరలోనే హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ మొదలవబోతుందని తెలుస్తోంది. కాగా సలార్ లో కన్నడ నటుడు విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా సలార్ ఐదు భాషలలో విడుదల కాబోతుంది. ఇక ఈ ఏడాదిలోనే సలార్ రిలీజ్ కానుంది.