Prabhas: తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ వ్యక్తిత్వం గురించి అందరికీ ఉన్న అభిప్రాయం ఒక్కటే. వివాదాలు అంటే దూరంగా ఉంటూ కనీసం స్టేజి పైన మాట్లాడేందుకు కూడా సిగ్గుపడే మనస్తత్వం అతనిది. అలాంటి ప్రభాస్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పైనే సెటైర్ వేసాడు అంటే వినడానికి కొంచెం విడ్డూరంగానే ఉంటుంది.
విషయం ఏమిటంటే ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న రాధే శ్యామ్ చిత్రం ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన ప్రభాస్ ను ఒక విలేకరి కష్టమైన ప్రశ్న అడుగుతాడు. ఇంతకీ చిత్రంలో ప్రేమకి, విధికి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రభాస్ నవ్వుతూ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మీరు టికెట్ కొనుక్కుని సినిమా చూడాల్సిందే అని అంటాడు. ఇప్పుడు చెప్పేస్తే 300 కోట్లు పెట్టి చిత్రం నిర్మించిన ప్రొడ్యూసర్ తనను కొడతాడు అని చెప్పి, పైగా ఇప్పుడు టికెట్ కేవలం యాభై రూపాయలే కదా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ఆ టికెట్ కూడా కొనలేరా అంటూ నవ్వుతూ సమాధానం ఇస్తాడు. అతని భావం అర్థమైన అందరూ ఈవెంట్లో నవ్వేస్తారు.
వాస్తవంగానే 300 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాను ఒక తెలుగు ప్రేక్షకుడు 50 రూపాయలు టికెట్ పెట్టి చూస్తున్నాడు అంటే వినడానికి చాలా విడ్డూరంగా ఉంది. అయితే రాధే శ్యామ్ చిత్రం విడుదల అయ్యే లోపల పెంచిన టికెట్ ధరలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేస్తుందని సమాచారం. అదే కనుక జరిగితే సినిమా నిర్మాతలకు అంతకు మించిన తీపికబురు ఉండదు. ఇక చిత్రం విషయానికి వస్తే ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ మొత్తం అద్భుతంగా ఉంది. హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో విపరీతమైన ఆసక్తి . ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే 11వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!