Prabhas : టాలీవుడ్ లో బాహుబలి సినిమాల తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ గురుపూర్ణిమ సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ కె అని పెట్టారు. ఫస్ట్ క్లాప్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్పై కొట్టి ఆయన మీదే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్లో ప్యాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ కె బడ్జెట్ 500 కోట్లకు పైగానే కేటాయించి నిర్మిస్తున్నారు. అనూహ్యంగా ప్రాజెక్ట్ కె చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ముందు నుంచి ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ లలో ఒకరు సంగీతం అందించవచ్చునని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ షాకిస్తూ మిక్కి జే మేయర్ ని ప్రకటించారు. ఇక ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు.
Prabhas : ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ మొత్తం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేశారట.
అయితే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను పూర్తి చేసి ప్రాజెక్ట్ కె లో జాయిన్ కానున్నాడట. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చేస్తుండగా, పిరియాడిక్ లవ్ స్టోరీ గా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా చిత్ర షూటింగ్ ఇంకా 10% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్.. కేజీఎఫ్ దర్శకుడితో సలార్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఇవి పూర్తయ్యాక ‘ప్రాజెక్ట్ K’ లో జాయిన్ అవనుండగా సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేశారట. దీని కోసం భారీ సెట్స్ రెడీ చేస్తున్నారు.