Prabhas : ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సాహో తర్వాత దాదాపు రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ తో వస్తున్నాడు. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కనిపించబోతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి రొమాంటిక్ సినిమా చేయకపోవడం తో భారీ అంచనాలున్నాయి.
అయితే గత కొన్ని రోజుల నుంచి రాధేశ్యామ్ సినిమా అప్డేట్స్ ఏంటన్నది తెలియడం లేదు. కొంతమంది ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందంటుంటే కొందరేమో ఇప్పటికే టాకీపార్ట్ కంప్లీట్ అయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందని చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా రాధేశ్యామ్ సినిమా కి సంబంధించి ఒక సాలీడ్ అప్డేట్ ఇచ్చింది హీరోయిన్ పూజా హెగ్డే. ఈ సినిమాకి తన డబ్బింగ్ పార్ట్ కంప్లీట్ చేసిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పూజా హెగ్డే. అయితే అది సినిమా టాకీ పార్ట్ కి సంబంధించింది కాదు.
Prabhas : రాధేశ్యామ్ టీజర్ కి తన పార్ట్ కి డబ్బింగ్ ని పూర్తి చేసిన పూజా హెగ్డే..!
త్వరలో రాబోతున్న రాధేశ్యామ్ టీజర్ కి సంబంధించి పూజా హెగ్డే తన పార్ట్ కి డబ్బింగ్ ని పూర్తి చేసిందని తెలిపింది. ఇందుకు గాను డబ్బింగ్ థియేటర్ లో ఉన్న పిక్ ని షేర్ చేసింది. ఈ పిక్ లో రాధేశ్యామ్ టైటిల్ ని చూపిస్తోంది పూజా హెగ్డే. కాగా రాధేశ్యామ్ టీజర్ ఈ నెల 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ టీజర్ లో ప్రభాస్ హ్యాడ్సం గా .. పూజా హెగ్డే క్యూట్ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రాధేశ్యామ్ టీజర్ డ్యూరియేషన్ దాదాపు 1 నిముషం 30 సెకన్లు ఉంటుందని తెలుస్తోంది.