Prabhas : పాన్ ఇండియా మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి వల్ల అన్ని మూవీల షూటింగ్స్ను ఆపి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభాస్ మూవీస్ కూడా వాయిదా పడ్డాయి. ఈ ఖాళీ సమయంలో ప్రముఖ హీరోలు తమ కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభిమానులు.. “అయ్యయ్యో ప్రభాస్ ఎవరికీ చెప్పకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్” అంటూ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
Prabhas : అయ్యయ్యో ప్రభాస్.. ఎవ్వరికీ చెప్పకుండా ఈ నిర్ణయమేంటి
ప్రస్తుతం ప్రభాస్ అండ్ గ్రౌండ్కు వెళ్లినట్టుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఆయన బయటికి వచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు సినిమాల్లో సెట్స్పైకి తీసుకెళ్లిన ప్రభాస్.. ఇప్పుడు మరికొన్ని చిత్రాలను వరుసలో పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా ఈ ఖాళీ సమయంలో వర్చువల్ గా స్క్రిప్స్ను వింటున్నారని టాక్. మరి ఆయన ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి ఎందుకు వెళ్లినట్లు? దానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రీజనేంటి?
సంక్రాంతి పండుగ సందర్భంగా ‘రాధే శ్యామ్’ థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి దృష్ట్యా సినిమాని వాయిదా వేయాలని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి తోడు షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలో తనకు బయట ప్రమోషన్లు, షూటింగ్స్ గట్రా చెయ్యాల్సిన పనులు లేవని భావించి ఎవరికీ కనపడకుండా అండ్ గ్రౌండ్కు వెళ్లినట్లు కొన్ని కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రభాస్ శారీరకంగా కాస్త వీక్ అయిపోయారు. నల్లపూసలా మారి కాస్త ఆకర్షణ కోల్పోయారు. అయితే విశ్రాంతి తీసుకుంటే గానీ మళ్లీ తనకు గ్లామర్ రాదని ప్రభాస్ భావిస్తున్నారట. అందుకే తగిన విశ్రాంతి కోసం ఇప్పుడు అండర్ గ్రౌండ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.
Prabhas : ఏంటి ప్రభాస్ ఒక్క సినిమాకి అంతా తీసుకుంటాడా .. రజినీకాంత్ కూడా పనికిరాడు !