Prabhas : బాలీవుడ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్ ఓం రౌతు దర్శకత్వంలో ప్రభాస్ “ఆది పురుష్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర లో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగింది. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద స్టార్ నటీనటులు నటిస్తున్నారు.
ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆది పురుష్” గురించి తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సరికొత్త విషయాన్ని బయటపెట్టారు. మొదటి నుండి సినిమాలో ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు అన్న దానిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తున్నట్లు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ స్థాయి మరో లెవెల్లో ఉంటుందని పేర్కొన్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న నేపథ్యంలో ఆయన యొక్క మార్కెట్ అంతర్జాతీయంగా ఇప్పుడున్న స్థాయి కంటే మరింతగా పెరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సినిమాలో సీత పాత్రలో దీపికా పదుకొనే కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఇన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు “ఆది పురుష్” పై వస్తున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరోపక్క నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాకు సంబంధించి అప్ డేట్ త్వరలో రాబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా అని..సమాచారం.