ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచి రాజు..తన కుటుంబ సభ్యులు మానసింగా కృంగిపోతున్న సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న ప్రదీప్ మీద కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రదీప్ వాపోతున్నాడు. హీరోగా మారుతున్న సమయంలో నాకు కెరీర్ లేకుండా చేయాలనే ప్లాన్స్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా తనపై సినీ ప్రముఖులు వారి పీఏలు ప్రజాప్రతినిధులు పోలీసులు జర్నలిస్టులు కలిసి మొత్తం 143మంది అత్యాచారం చేశారని ఒక 24 ఏళ్ల అమ్మాయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసు తెలంగాణలో పెద్ద సంచలనమైంది. దీంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేయగా వారు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ పేరు కూడా వినిపిస్తోంది. ఆ యువతి ప్రదీప్ ను కూడా నిందితుడిగా పేర్కొంటూ ఆ 143మందిలో ఒకడిగా ఫిర్యాదు చేసినట్టు విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంలో స్పందించిన ప్రదీప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు నన్ను ..నా కుటుంబాన్ని ఎంతో బాధపెడుతున్నాయని.. ఇలాంటి సున్నిత విషయాల్లో తన పేరు ఉపయోగిస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయాడు. ఇది అడ్డు పెట్టుకొని సోషల్ మీడియాలో నన్ను ట్రోలింగ్ చేస్తున్నారని బాధపడ్డాడు. యూట్యూబ్ వెబ్ సైట్స్ వ్యూస్ కోసం తనను టార్గెట్ చేస్తున్నారని యాంకర్ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు. ప్రస్తుతం బుల్లితెర మీద పాపులర్ యాంకర్ గా వరసగా ఎంటర్టైన్మెంట్ షోస్ చేస్తున్న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం అన్న సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.