మీకు గుర్తుందా? మోదీ ప్రధాన మంత్రి అయ్యాక… దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా బ్యాంకులో అకౌంట్ ఉండాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. జన్ ధన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ద్వారా ఏ బ్యాంకులో అయినా అకౌంట్ తీసుకుంటే కొన్ని లాభాలు ఉంటాయి. ఆ అకౌంట్ కు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం ఉండదు. లక్ష రూపాయల వరకు యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ ను కూడా ఈ అకౌంట్ ద్వారా ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
వీటితో పాటు 30 వేల రూపాయల లైఫ్ ఇన్సురెన్స్ కూడా ఉంటుందని మీకు తెలుసా? మీకే కాదు.. చాలామందికి ఈ విషయం తెలియదు. అయితే.. లైఫ్ ఇన్సురెన్స్ అనేది అందరికి కాదు. కొందరికే అందుబాటులో ఉంటుంది.
ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో అందరూ జన్ ధన్ ఖాతాలు తీసుకుంటే.. వాళ్లలో కుటుంబ పెద్దకు మాత్రమే ఆ ఖాతా కింద లైఫ్ ఇన్సురెన్స్ కవర్ చేస్తారు. ఒకవేళ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే… ప్రైమరీ అకౌంట్ హోల్డర్ కు మాత్రమే కవరేజ్ ఉంటుంది.
2014లో ఈ పథకం ప్రారంభం అయింది. 2014 ఆగస్టు 15 నుంచి 2015 జనవరి 26 మధ్య రూపే కార్డుతో పాటు అకౌంట్ ను తీసుకున్న వాళ్లకు మాత్రమే ఈ లైఫ్ ఇన్సురెన్స్ వర్తిస్తుంది.
ఒకవేళ జన్ ధన్ ఖాతా తీసుకున్న అకౌంట్ హోల్డర్ మరణిస్తే… నామినీకి 30 వేల ఇన్సురెన్స్ డబ్బులు చెల్లిస్తారు. ఖాతా కింద తీసుకున్న రూపే డెబిట్ కార్డును ఆధార్ కు లింక్ చేసుకొని ఉంటేనే లైఫ్ ఇన్సురెన్స్ కవర్ అవుతుంది.
ఒక్క వ్యక్తి ఎన్ని జన్ ధన్ ఖాతాలు తీసుకున్నా ఒకటే ఇన్సురెన్స్ కవర్ అవుతుంది. ఇక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు, ఐటీ రిటర్న్స్ పైల్ చేస్తున్నవారు, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వాళ్లకు ఈ ఇన్సురెన్స్ వర్తించదు.