మెల్బోర్స్(ఆస్ట్రేలియా), జనవరి 14: భారత టెన్నీస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్కు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. మెల్బోర్న్లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో భాగంగా సోమవారం జరిగిన మొదటి రౌండ్పోరులో 39వ ర్యాంకర్ టియాఫో(అమెరికా) చేతిలో 7-6(9/7), 6-3, 6-3 తేడాతో ప్రజ్నేశ్ ఓటమి చెందాడు.
తొలి సెట్ ఇద్దరి మధ్య టై బ్రేక్కు దారితీయడంతో అమెరికన్ ప్లేయర్ విజయం సాధించాడు. అటుపైన మిగిలిన రెండు సెట్లలో భారత ఆటగాడు ప్రతిఘటించకలేక పోవడంతో పరాజయం తప్పలేదు.
ఈ గేమ్లో టియాఫో 88శాతం నెట్ పాయింట్లు సాధించగా, ప్రజ్నేశ్ 67శాతం పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు. అనవసర తప్పిదాల కారణంగా తొలిరౌండ్ నుంచే ఇండియన్ ప్లేయర్ టోర్ని నుండి వెనుదిరగాల్సి వచ్చింది.
రెండో రౌండ్లో అమెరికన్ ప్లేయర్ ఐదో సీడ్ కెవిన అండర్సన్(దక్షిణాఫ్రికా)తో తలపడనున్నాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన తొలి ఆటగాడుగా ప్రజ్నేశ్ నిలిచాడు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?