(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది. వరద ప్రవాహం గంట గంటకు ఎక్కువ అవుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మున్నేరు, కట్లేరు, వైరా ఏరులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పులిచింతల నుండీ భారీగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 4,34,221 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 4,05,929 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. తూర్పు, పశ్చిమ కెనాళ్లకు మూడు వేలకు పైగా క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ నుండి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతున్నందున అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.