Prakasam SP: ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది.నిన్నమొన్నటి వరకు పోలీసు శాఖను సంస్కరించటం తోపాటు ప్రజలకి పోలీసింగ్ ని చేరువ చేయడానికి ఆయన తీసుకున్న చర్యలు అన్నీ ఇన్నీ కావు.అవన్నీ సత్ఫలితాలిచ్చాయి.సిద్ధార్థ కౌశల్ కు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి.అత్యంత సమర్ధుడైన పోలీసు అధికారిగా టాప్ ర్యాంకింగ్లో ఈరోజు సిద్ధార్థ్ కౌశల్ ఉన్నారు. ఇది నాణేనికి ఒకవైపు అయితే కరోనా సమయంలో ఆయన పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు అనితరసాధ్యమైనవిగానూ, నభూతో నభవిష్యత్ అన్నట్టుగానూ మరోవైపు కనిపిస్తున్నాయి.
Prakasam SP: పోలీసుల కోసం ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్
ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనివిధంగా ప్రప్రథమంగా కరోనా బారినపడే పోలీసు సిబ్బంది కోసం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆయన ఈ సెంటర్ గా మార్చి సకల వసతులు కల్పించారు.ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ బెడ్లను కూడా అమర్చారు. అతి రుచికరమైన బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ఆ కేంద్రంలో అందిస్తున్నారు.ప్రతిరోజూ ఒక్కసారైనా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆ కేంద్రాన్ని సందర్శించి ప్రతి ఒక్కరి బాగోగులు అడిగి తెలుసుకోవటమే ఆయనలోని మానవతా కోణానికి అద్దం పడుతోంది.ఏ ఒక్క పోలీసు కూడా కరోనాకు బలికాకూడదనేదే ఎస్పీ లక్ష్యంగా కనిపిస్తోంది.
మానసిక ఉల్లాసానికి పెద్ద పీట!
కరోనాను మందులతో కన్నా మనోధైర్యంతో తగ్గించుకోవచ్చునని, ఇందుకు కావల్సింది మానసికోల్లాసం అని అర్థం చేసుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ కేంద్రంలో రిక్రియేషనల్ థెరపీని కూడా ప్రవేశపెట్టారు.అంటే కరోనా రోగులే ఆడిపాడేలా ఎస్పీ స్వయంగా ఏర్పాటుచేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కానిస్టేబుల్ మొదలు ఇన్స్పెక్టర్ల వరకు అందరూ తమ తమ ప్రతిభను చాటారు.వారి ఆట పాటలు చూసి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ముగ్ధులైపోయారు.మురిసిపోయారు.ఇదే నాకు కావాల్సిందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు.భయాన్ని మించిన రోగం లేదని..అదే సమయంలో సంతోషాన్ని మించిన మందు లేదని ఎస్పీ వ్యాఖ్యానించారు.ఒక్క పోలీసు సిబ్బంది కే కాదు ..కరోనా తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ మనోధైర్యంతో,మానసిక ఉల్లాసంతో ఈవ్యాధిని సులువుగా అధిగమించవచ్చునన్న సందేశాన్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇచ్చిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎంతైనా అభినందనీయులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?