Pension For Trees: “వృక్షో రక్షతి రక్షితః”.. చెట్లను మనం రక్షిస్తే అవి మనలను కాపాడుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా హర్యానా ప్రభుత్వం ప్రాణవాయువును అందిస్తున్న వృక్షాలకు సరికొత్త పథకాన్ని ప్రకటించింది.. ఆ రాష్ట్రంలో 75 సంవత్సరాలు నిండిన, ఆపై వృక్షాలను గుర్తించి వాటికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.. “ప్రాణ వాయు దేవత పింఛన్ పథకం” పేరుతో 75 సంవత్సరాలు నిండిన చెట్లకు ప్రతి సంవత్సరం రూ.2500 అందించడంతో పాటు వాటికి వారసత్వ హోదా కల్పించనుంది..!!
Nagarjuna: ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున.. వాస్తవమెంత..!!
ఈ పెన్షన్ లు ఎలా ఇస్తారంటే..!!
ప్రైవేటు వ్యక్తుల స్థలంలో 75 సంవత్సరాలు నిండిన చెట్టు ఉన్నట్లయితే ఆ వ్యక్తిని యజమాని గా గుర్తించి సంవత్సరానికి ఒకసారి ప్రాణ వాయు దేవత పెన్షన్ను అందజేస్తారు. అదే పంచాయితీ స్థానిక సంస్థల స్థలం లో ఉంటే సర్పంచి, చైర్మన్ ఆ వృక్షాల సంరక్షకుని గా గుర్తిస్తారు. విద్యాసంస్థల ఆవరణలోని ఉంటే ప్రిన్సిపల్, ఇతర సంస్థలు అయితే ప్రధాన అధికారికి, అడవి ఏ ప్రాంతంలో ఉంటే అటవీ అధికారికి కి ఆ పెన్షన్ మొత్తాన్ని అందజేస్తారు. ఈ పెన్షన్ అందుకున్న వృక్షం విశిష్టతను వివరిస్తూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలి. చెట్టు ఉన్న ప్రాంతాన్ని అందంగా తీర్చి దిద్ది, ఆ చెట్టుకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలి. ఆ చెట్టుకింద నీడలో ప్రజలు కూర్చోవడానికి ఏర్పాటు చేయాలి. ఆ వృక్షానికి తెగుళ్లు, చీడ పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని హర్యానా ప్రభుత్వం సూచించింది. 100 ఎకరాలు చొప్పున స్థలాలు కేటాయించి వాటిలో రకరకాల మొక్కలను పెంచి ఆ వనాలకు ధ్యాన వనం, ఆరోగ్య వనం, సుగంధ వనం అని పేర్లు పెట్టనుంది..