కరోనా మహమ్మారి దేశంలో ఎవరినీ వదలట్లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వైరస్ పెద్ద సంకటంగా మారింది. ఒకరి తర్వాత ఒకరిని…. ఎమ్మెల్యేలు, మంత్రులు, చోటా లీడర్లు, బడా రాజకీయవేత్తలు అన్న తేడా లేకుండా అందరినీ సోకుతున్న ఈ వైరస్ తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి కూడా అంటుకుంది.
తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా కోవిడ్ పరీక్షల్లో నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ గారే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇక గత కొద్ది రోజులుగా తనను సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నానని అయన వెల్లడించారు.
అలాగే ప్రణబ్ కి ఎవరి ద్వారా వైరస్ సోకి ఉంటుంది అన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు. బాగా ఎక్కువ వయసు ఉన్న ప్రణబ్ ని ఇప్పుడు వైద్యుఅల్ పర్యవేక్షణ లో ఉంచారు.