Prasant kishore: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ మళ్లీ రాజకీయ వ్యాహాకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఓ పక్క పశ్చిమ బెంగాల్ తృణముల్ కాంగ్రెస్,, మరో పక్క తమిళనాడులో డీఎంకే పార్టీలు దూసుకువెళుతుండటంతో ఆయా పార్టీల విజయానికి పీకే వ్యూహాలు ఫలించాయని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఢంకా భజాయించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు సవాల్ చేస్తున్న తరుణంలో టీఎంసీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో ఓ ట్వీట్ చేశారు. “200 కి పైగా స్థానాల్లో స్థానాల్లో గెలుస్తాం. బీజేపీని 100 కంటే తక్కువ స్థానాలకే కట్టడి చేస్తాం. బీజేపీ మూడంకెల స్థానాలను అందుకుంటే నేను రాజకీయ సర్వేల నుండి తప్పుకుంటా” అని పికే పేర్కొన్నారు. అప్పుడు ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి.
టీఎంసీ 205 స్థానాల్లో అధిక్యత కొనసాగుతుండగా బీజేపీ 84 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. గతంలో ప్రధాన మంత్రి మోడీకి, ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదుపరి ఏపిలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీకి పికే వ్యూహకర్తగా పని చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలోనూ కిషోర్ వ్యూహాలతో టీఎంసీ, డీఎంకే లు అధికారంలోకి వస్తుండటంతో పీకే వ్యూహాలు గ్రేట్ అంటూ నెటిజన్ ల నుండి కామెంట్స్ వస్తున్నారు. గతంలో పికే పశ్చిమ బెంగాల్ ఫలితాలకు సంబంధించి చేసిన ట్వీట్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
ఈ ఫలితాలపై ఏపి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బెంగాల్, తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ టీమ్ లే గెలిచాయన్నారు. మమతా బెనర్జీని బీజేపీ ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదని అన్నారు. దేశంలోనే ఆమె వీరనారిగా గెలిచారన్నారు. తమిళనాడులోనూ పీకే స్ట్రాటజీనే ప్రైచేయి సాధించి స్టాలిన్ ను సీఎం చేస్తోందని సోమిరెడ్డి పేర్కొన్నారు. పీకే వ్యూహాలే విజేతలయ్యాయి అని అన్నారు.
బెంగాల్,తమిళనాడులో @PrashantKishor టీంలే గెలిచాయి. @MamataOfficialను @BJP4India ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదు.దేశంలోనే ఆమె వీరనారిగా గెలిచారు.తమిళనాడులోనూ పీకే స్ట్రాటజీనే పైచేయి సాధించి@mkstalin ను సీఎం చేస్తోంది.మొత్తంగా పీకే వ్యూహాలే విజేతలయ్యాయి. pic.twitter.com/CpBJZPm63Z
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 2, 2021