ఏపీలో కి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీం రాబోతుంది. ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా ఇప్పుడు ఎందుకు రాబోతుంది అనే సందేహం రావచ్చు. ఎందుకంటే వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏమి లేనంతగా జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్ ల వ్యవస్థను తీసుకు వచ్చింది. గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చింది. భవిష్యత్తులో జగన్ అంటే గుర్తొచ్చేది సచివాలయ వ్యవస్థ, వాలంటీర్. వీటి పనితీరు ఎలా ఉంది, వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించడానికి పికె టీమ్ అలియాస్ ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏపీ లో అడుగు పెట్టబోతున్నది.
గత ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు ప్రశాంత్ కిషోర్ తన బృందంతో సహా ఏ పికి వచ్చి ఎన్నికల్లో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కీలకంగా పని చేశారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా కూడా క్షేత్రస్థాయిలో సర్వే అధ్యయనాలు పూర్తి చేసి వైఎస్ఆర్ సీపీ 151 సీట్లు గెలుచుకోవడం లో పికే తన పాత్ర సమర్ధవంతంగా పోషించారు. ఏపీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా తొలిసారి బీజేపీ గెలవడం లోనూ, బీహార్ లో నితీష్ కుమార్ గెలుపులో, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గెలుపులో కూడా పీకే కీలకంగా పని చేశారు. ప్రస్తుతం పీకే వెస్ట్ బెంగాల్ లో మమత బెనర్జీ గెలుపు కోసం తెర వెనుక పనిచేస్తున్నారు. ఇన్నాళ్ళు కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే పని చేసిన పికె ప్రస్తుతం పథకాల అమలు పర్యవేక్షించడానికి, అమలు తీరు అద్యనం చేయడానికి సర్వే చేపట్టబోతుండటం, సీఎం కు అండగా నిలవడం ఇదే తొలిసారి. జగన్ లక్ష్యం నెరవేరుతుందా లేదా వాలంటీర్ లు, సచవాలయాల పని తీరు ఎలా ఉంది అనేది క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి వాస్తవాలు తెలుసుకోవడానికి జగన్ కు ఉన్న ఏకైక మార్గం పీకే నే. అందుకే పికె మళ్లీ ఏపి లోకి దిగబోతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?