కోర్టు దిక్కార నేరానికి సంబంధింది ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు సుప్రీం కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. ప్రశాంత్ భూషన్కు ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఈ జరిమానా సెప్టెంబర్ 15వ తేదీ లోగా చెల్లించాలని ఆదేశించింది. ఈ జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష, మూడేళ్ల పాటు ప్రాక్టీస్ చేయకుండా నిషేదం విధిస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్విసభ్య ధర్మాసనం తీర్పులో పేర్కొన్నది.
అసలు వివాదం ఏమిటంటే…
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్ జూన్ 27, 29 తేదీల్లో చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. ఆయన మొదటి ట్వీట్ లో గతంలో పని చేసిన నలుగురు సుప్రీం న్యాయమూర్తుల పనితీరును తప్పుబట్టారు. తరువాత ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫోటో ట్వీట్ చేశారు. వీటికి సంబంధించి సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని ప్రశాంత్ భూషణ్ కోర్టు దిక్కారానికి పాల్పడ్డారన్నఅభియోగంతో విచారణ జరిపి ఆగస్టు 14న దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెల్లడించింది.
ఈ నెల 20వ తేదీన ఆయనకు శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా, ట్వీట్లపై పునరాలోచించుకొని ఉన్నత న్యాయస్థానంకు ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పేందుకు మూడు రోజులు గడువు ఇచ్చింది. అయితే ప్రశాంత్ భూషణ్ తాను క్షమాపణ చెబితే నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందని, తాను నిజాయితీతో వ్యక్తం చేసిన అభిప్రాయాలను వెల్లడించినందున తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు చేయవద్దంటూ సుప్రీం కోర్టుకు అటార్జీ జనరల్ కూడా విజ్ఞప్తి చేశారు.
Supreme Court imposes a fine of Re 1 fine on Prashant Bhushan. In case of default, he will be barred from practising for 3 years & will be imprisoned of 3 months https://t.co/0lMbqiizBb
— ANI (@ANI) August 31, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?