కన్నడ హీరో యశ్ అనే పేరు ప్రస్తుతం అందరికి సుపరిచితమే.. కానీ కొంతకాలం క్రితం అంటే 2018 కి ముందు టాలీవుడ్ లో ఈ పేరు అంతగా ఎవరికి తెలియదు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ అనే పాన్ ఇండియా చిత్రం ద్వారా రాకీ భాయ్ పాత్రలో యశ్ ను అన్ని వర్గాల ప్రేక్షకులకు ఊహించని స్దాయిలో పరిచయం చేశాడు. ఇలా 2018లో విడుదలైన ‘కేజీఎఫ్’ అనే చిత్రం మంచి విజయం సాధించడమే కాదు ఈ నటుడికి జాతీయ స్థాయిలో గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. ఒకరకంగా బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో సత్తా చాటిన చిత్రంగా కేజీఎఫ్ పేర్కొనబడుతుంది. అదీగాక దేశం గర్వించదగ్గ ఓ భారీ చిత్రాన్ని రూపొందించి చూపించారు సాండల్వుడ్ మేకర్స్ అనే ప్రశంస అందుకుంది.
ఇక ఈ సినిమాతో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లకు ఒక్కసారిగా నేషనల్ లెవల్లో క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమా సీక్వెల్గా కేజీఎఫ్ చాప్టర్ 2 ను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అంతే అభిమానుల్లో ఈ సినిమా సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్ర యూనిట్ కూడా ఈ సీక్వెల్ను మరింత భారీగా తెరకెక్కించడానికి శ్రమిస్తున్నారట.. అయితే ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి సినీ వర్గాలతో పాటుగా, యశ్ అభిమానులు, ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క అప్డేట్ను కూడా మిస్ అవకుండా ఫాలో అవుతున్నారట. ఈ దశలో ఈ మూవీకి మరింత హైప్ వచ్చేలా ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్నారు.
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సంజయ్ దత్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు నటుడు అయినా రవి శంకర్ డబ్బింగ్ చెబుతున్నాడట. ఇలా అభిమానులు తట్టుకోలేనంతగా కేజీఎఫ్ అప్డేట్స్ తో సర్ప్రైజ్ ఇస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సారి కూడా భారీ స్దాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటున్నారట సినీ విశ్లేషకులు. అదీగాక ఈ అప్డేట్ తో సినిమా మీద ఊహించని రీతిలో అంచనాలు పెరగడం ఖాయం అనే టాక్ కూడా వినిపిస్తుంది. కాగా అత్యంత భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిందట.