కేజీయఫ్ 2 మీదే ఇప్పుడు దేశంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా సిద్దం చేస్తున్నాడు. 2018 లో వచ్చిన కేజీయఫ్ ఎవరూ ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని అందుకోవడంతో కేజీయఫ్ కి కొనసాగింపుగా కేజీయఫ్ చాప్టర్ 2 రూపొందిస్తున్నారు.
కాగా ఈ సినిమాకి దాదాపు టాకీపార్ట్ కంప్లీటవగా క్లైమాక్స్ సీన్స్ మాత్ర బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఒక భారీ యాక్షన్ సీన్స్ ని అధీరా గా నటిస్తున్నసంజయ్ దత్, రాఖీ భాయ్ గా నటిస్తున్న యష్ ల మధ్య షూట్ చేయనున్నారట. సినిమా మొత్తానికే హైలెట్ గా నిలవనున్న ఈ యాక్షన్ సీన్స్ లో పాల్గొనేందుకు ఇప్పటికే సంజయ్ దత్, యష్ హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం.
కాగా ఈ క్లైమాక్స్ సీన్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. బాహుబలి కన్క్లూజన్ లో ప్రభాస్ – రానా మధ్య ఉన్నదానికంటే ఇంకా గొప్పగా ఉండబోతున్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ఒక్క క్లైమాక్స్ సీన్ గురించే జనాలు కొన్నేళ్ళపాటు చర్చించుకుంటారని అంటున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చాప్టర్ 2 సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఖాయమని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్ క్రియోట్ చేయనుందో.