Prabhas: దక్షిణాది సినిమాలు భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. బాహుబలితో మొదలైన కలెక్షన్ల వర్షం, తాజాగా విడుదలైన కేజీఎఫ్ వరకూ కొనసాగాయి. పుష్ప పార్ట్ 1 భారీ వసూళ్లు సాధించడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ పక్కా స్క్రిప్ట్తో రెడీ అవుతున్నాడని సమాచారం.
Prabhas: ప్రశాంత నీల్ భారీ స్కెచ్
మొన్న బాహుబలి మొదలు.. నేటి పుష్ప వరకూ సీక్వెల్స్ హంగామా నడుస్తోంది. సినిమాను 2 పార్టుల్లో తీయడం ద్వారా అధిక లాభలను పొందవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా ను సైతం 2 పార్టుల్లో తీస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కు పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని సలార్ ను 2 పార్టుల్లో తీయడమే కరెక్ట్ అని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.
కేజీఎఫ్కి తలదన్నేలా సలార్..
సలార్ పూర్తి యాక్షన్ చిత్రమని, కేజీఎఫ్ కు మించి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్. ఇప్పటికే చిత్రంలో 5 ప్రధాన యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసారు. ప్రస్తుతం ఆరో యాక్షన్ సీన్ చిత్రీకరణలో ఉంది. అటు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటుగా ఇటు ప్రశాంత్ నీల్ అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా, మలయాళ నటుడు సుకుమారన్ ఓ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నాడు. వేగంగా సినిమా చిత్రీకరణను పూర్తి చేసి తొందరలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ హై వాల్టెజ్ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.