Praveen satharu : ప్రవీన్ సత్తారు టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సందీప్ కిషన్ – రెజీనా జంటగా నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత చందమామ కథలు అన్న సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి సక్సస్ ని సాధించింది. ఇక రష్మీ గౌతం హీరోయిన్ గా నటించిన గుంటూరు టాకీస్ సినిమాతో హట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ మూడు సినిమాలు మంచి హిట్ గా నిలిచి టాలీవుడ్ లో తనకంటు ఒక గుర్తింపు దక్కేలా చేసుకున్నాడు. ఇక యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ తో చేసిన గరుడ వేగ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్నాడు.
అంతేకాదు ఈ సినిమాతో రాజశేఖర్ కి సాలీడ్ హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రవీన్ సత్తారు తో సినిమా చేయాలని పలువురు టాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జున తో ప్రవీన్ సత్తారు ఒక సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. కాగా ఎట్టకేలకి ఆ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకి రానుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఇక ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో నాగార్జున కి జంటగా అనిఖా సురేంద్రన్ నటించబోతుందని తెలుస్తోంది.
Praveen satharu : అనిఖా సురేంద్రన్ ఇప్పటికే అజిత్ తో కలిసి రెండు సినిమాలలో నటించింది..!
ఈ బ్యూటీ టాలీవుడ్ కి ప్రవీన్ సత్తారు పరిచయం చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నాగార్జున సరసన నటింప చేసేందుకు ఫైనల్ కూడా చేశాడని అంటున్నారు. రీసెంట్ గా అనిఖా సురేంద్రన్ కి స్క్రీన్ టెస్ట్ చేసి నాగార్జున కి చూపించగా ఒకే అన్నాడని సమాచారం. ఇప్పటికే అజిత్ తో కలిసి రెండు సినిమాలలో నటించింది. తమిళ ప్రేక్షకులకి అనిఖా బాగానే పరిచయం ఉంది. ఇప్పుడు ఈ బ్యూటీని ప్రవీన్ సత్తారు నాగార్జున సినిమాతో టాలీవుడ్ కి తీసుకురాబోతున్నాడని తెలుస్తోంది. ఇక నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ రిలీజ్ కి రెడీగా ఉంది.